Thursday, October 20, 2016

కీళ్ల నొప్పులనైనా (ఆర్థరైటీస్) త‌గ్గించే అద్భుత‌మైన ఔష‌ధం.!

మెంతులు… 
ఒక టీస్పూన్ మెంతుల‌ను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఆ నీటిని తాగాలి. దీంతో ఎలాంటి ఆర్థ‌రైటిస్ నొప్పి అయినా ఇట్టే న‌యం అవుతుంది. అయితే ఈ విధానాన్ని క‌నీసం 3 నెల‌ల వ‌ర‌కు పాటించాలి. నొప్పి కొంచెం తక్కువ‌గా ఉన్న‌వారికైతే 30 నుంచి 40 రోజుల్లోనే చెప్పుకోద‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది.


పారిజాత ఆకులు… 
పారిజాత మొక్క తెలుసుగా. దీని పూలు తెలుపు రంగులో ఉంటాయి. రాత్రి పూట ఈ పూలు పూస్తాయి. చాలా దూరం వ‌ర‌కు ఈ పూల సువాసన వ‌స్తుంది. దేవాల‌యాల్లో ఎక్కువ‌గా ఈ మొక్క‌లు ఉంటాయి. వీటి ఆకుల‌ను 6,7 సంఖ్య‌లో తీసుకుని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒక గ్లాస్ నీటిలో వేసి మ‌రిగించాలి. ఆ నీరు స‌గం అయ్యే వ‌ర‌కు క‌షాయం కాచుకోవాలి. అలా వ‌చ్చిన కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చ‌ల్ల‌గా ఉండగా తాగేయాలి.
పైన చెప్పిన పారిజాత ఆకుల క‌షాయం రుమ‌టాయిడ్‌, ఆస్టియో ఆర్థ‌రైటిస్ నొప్పుల‌కు ఎంతో అద్భుత‌మైన ఔష‌ధంగా పనిచేస్తుంది. దీన్ని నిత్యం ఏ రోజు కారోజు త‌యారుచేసుకుని తీసుకుంటే కేవ‌లం 30 నుంచి 40 రోజుల్లోనే ఎలాంటి కీళ్ల‌నొప్పులైనా దూర‌మ‌వుతాయి. ఎముక‌ల్లో అరిగిపోయిన కార్టిలేజ్ గుజ్జు తిరిగి ఉత్ప‌త్తి అవుతుంది. అయితే ఈ ఔష‌ధం డెంగీ జ్వ‌రానికి కూడా బాగానే ప‌నిచేస్తుంది. డెంగీ కార‌ణంగా వ‌చ్చే ఒళ్లు నొప్పులు త‌గ్గుముఖం ప‌ట్టాలంటే ఈ ఔష‌ధాన్ని తాగాలి.
పైన సూచించిన రెండు ప‌ద్ధ‌తుల్లో దేన్నో ఒక‌దాన్ని మాత్ర‌మే ప్ర‌య‌త్నించాలి. లేదంటే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఎప్సం సాల్ట్

స్నానానికి వేడి నీళ్లు రెడీ చేసుకున్నారా? అయితే అందులో రెండు స్పూన్ల ఎప్సం సాల్ట్ ను వేసి ఓ రెండు నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే….ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి. ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్  శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల ..అలసిన మీ దేహం ఒక్కసారిగా తేలికవుతుంది. కీళ్లనొప్పులు, నరాల బెణుకులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి .చర్మంపై మృత కణాలను తొలగించి, మీ చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది.
ఉదయం సాయంత్రం గోరువెచ్చటి నీటిలో రెండు టీ-స్పూన్ల ఎప్సం సాల్ట్ ను కలుపుకొని తాగితే ఏమవుతుందంటే:
కీళ్ల నొప్పులు మటుమాయం: 
ఎముకలకు కాల్షియం, పాస్పరస్ తగిన రీతిలో అందకుంటే….అవి బలహీనంగా మారి నొప్పులకు దారి తీస్తాయి. కాల్షియం, పాస్పరస్ లు అందాలంటే ఖచ్చితంగా మెగ్నీషియం ఉండాలి. కాబట్టి ఎప్సం సాల్ట్ నుండి మెగ్నీషియాన్ని పొందిన ఎముకలు…ఇతర పదార్థాల నుండి అందే కాల్షియం, పాస్పరస్ లను వెంటనే గ్రహించి…బలంగా తయారవుతాయి. ఎముకలు బలంగా ఉంటే కీళ్ల నొప్పులకు ఆస్కారం ఉండదు. కాబట్టి ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల ఎప్సం సాల్ట్ ను కలిపి తాగడం వల్ల…ఆర్థరైటీస్ సమస్య ఉండదు.
మలబద్ధకం మాటే ఉండదు:
గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల ఎప్సం సాల్ట్ ను కలిపి తాగడం వల్ల..దీనిలో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం… మల ప్రవాహంలో చుట్టూ ఉండే ప్రదేశాల నుంచి నీటిని పీల్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మలాన్ని బయటకి వెళ్లేలా చేస్తుంది.
  • అంతేకాక…గోరువెచ్చని నీటిలో కలిపిన ఎప్సం సాల్ట్ ను హ్యాండ్ వాష్ గా, టైల్స్, ఫ్లోర్ ను శుభ్రపరిచేందుకు సైతం ఉపయోగించవచ్చు.
  • ఎప్సం సాల్ట్ …..ఏ  జనరల్ స్టోర్స్ లో అయినా దొరుకుతుంది.