Wednesday, May 18, 2016

జ్యోతిష్యంలో ధనాభివృద్ధికి ఇందులగ్నం

ఉత్తరకాలామృతంలో కాళిదాసు గ్రహాలకు స్ధిరకళలను ఇచ్చారు.వీటినే దృవాంకాలు అంటారు.
రాశిచక్రంలో లగ్నం నుండి నవమాధిపతి మరియు చంద్రుడి నుండి నవమాధిపతులను నిర్ణయించివాటికి ఇచ్చిన స్ధిరకళలను కలుపగా వచ్చిన సంఖ్యను 12 కంటే ఎక్కువ వస్తే 12 చేత భాగింపగా వచ్చు శేషం చంద్రుడి నుండి లెక్కింపగా వచ్చిన రాశి ఇందులగ్నం అవుతుంది.
ఇందులగ్నం వ్యక్తి యొక్క ఆర్ధికస్ధితి ,అభివృద్ధి,వ్యాపారాభివృద్ధిని తెలుపుతుంది.ఇందులగ్నంలో ఏ గ్రహాం ఉన్నా ,లగ్నాన్ని ఏ గ్రహాం చూస్తున్న ధనాభివృద్ధి బాగుంటుంది.
ఇందులగ్నం గ్రహా రహితంగా గాని,గ్రహాదృష్టి రహితంగా గాని ఉండరాదు.అలా ఉన్న యెడల ఇందులగ్నం యొక్క ప్రయోజనాలను జాతకుడు పొందలేడు.ఇందులగ్నంపై గోచార గురుడు సంచరించిన లేక చూచిన సాధారణంగా వచ్చే ధనం కాక అదనంగా ధనప్రాప్తి కలుగుతుంది.
ఇందులగ్న జాతకులకు ఆదాయంలో స్ధిరత్వం,తక్కువ శ్రమతో ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం ఉంటుంది.
ఇందులగ్నంలో గ్రహాలకు ఉన్న స్ధిర కళలు
సూర్యుడు:-30 కళలు
చంద్రుడు:-16 కళలు
కుజుడు:-6 కళలు
బుధుడు :-8 కళలు
గురువు:-10 కళలు
శుక్రుడు:-12 కళలు
శని :-1 కళ
ఇందులగ్నం నుండి ద్వితీయంలో గాని,లాభస్ధానంలో గాని గ్రహం దిగ్బలమ్ పొందితే దిగ్బలమ్ పొందిన గ్రహం సూచించు దిక్కులలో దన ఆదాయ మార్గాలు బాగా ఉంటాయి.
ఇందులగ్నం నుండి ద్వితీయంలో గురువు ఉంటే ధనం సంపాదిస్తాడు గాని చేతిలో నిలుపుకోలేడు.కారకోబావనాశాయ సూత్రం ప్రకారం భావ కారకుడు గురువు ద్వితీయ భావంలో ఉండటం మంచిది కాదు.
ఇందులగ్నాదిపతి బలహీనమైతే(నీచ,అస్తంగత్వం,శత్రు క్షేత్రాలలో)దరిద్రం పడుతుంది.ఎంత కష్ట పడ్డ శ్రమకు తగ్గ ఫలితం రాదు.
ఇందులగ్నాదిపతి,ద్వితీయాదిపతి,నవమాదిపతి,లాభాదిపతి హోరాచక్రంలో బలంగా ఉంటే ఏ పని చేసిన అదృష్టం కలసి వస్తుంది.
ఇందులగ్నాదిపతితో కుజగ్రహ సంబందం ఉంటే భూమికి సంబందించిన(సివిల్,రియల్ ఎస్టేట్,వ్యవసాయం) వ్యాపారాలలో బాగా రాణిస్తారు.
ఇందులగ్నాదిపతితో శుక్రగ్రహ సంబందం ఉంటే బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లో బాగా రాణిస్తారు. ఇందులగ్నాదిపతితో శని కలసి 4 వస్ధానంలో ఉంటే గనులు,మైనింగ్ రంగాలలో బాగా రాణిస్తారు.
ఇందులగ్నానికి,ద్వితీయానికి,చతుర్దానికి సంబందం ఉంటే స్ధిరాస్తులైన ఇల్లు,పొలాలు,బంగారం సంపాదించుకుంటాడు.
లగ్నాదిపతి,ఇందులగ్నాదిపతి శతృ ద్విద్వాదశాలలో ఉన్న,శతృ షష్టాష్టకాలలో ఉన్న, ఇందులగ్నాదిపతి షష్టమాదిపతి,వ్యయాదిపతులతో సంబందం ఉంటే దన సంబంద విషయాలలో కోర్టు గొడవలు,వివాదాలు ఉంటాయి.
ఇందులగ్నంలో ఏదైనా గ్రహం ఉచ్చ పొందితే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలలో జాతకుడు సంపాదించిన దనం అవసరాలకు వినియోగపడుతుంది.
ఇందులగ్నాదిపతి హోరాచక్రంలో స్వక్షేత్రంలో ఉంటే స్వ,ఇతరుల సహకారంతో సంపాదిస్తాడు.మిత్ర క్షేత్రంలో ఉంటే అదృష్టం కలసి వస్తుంది.
ఇందులగ్నంలో శత్రుగ్రహాలు ఉండి గురువు పాపగ్రహాలతో కలసి శతృ క్షేత్రంలో ఉన్న జాతకుడు అక్రమార్గాల ద్వారా దనం సంపాదిస్తాడు.
ఇందులగ్నాదిపతి హోరాచక్రంలో లగ్నంలోను,హోరా లగ్నాదిపతి ఇందులగ్నంలోను ఉన్న, ఇందులగ్నాదిపతి హోరాచక్రంలో లగ్నంలోను లాభాదిపతి ద్వితీయంలోను,ద్వితీయాదిపతి లాభంలో ఉన్న ఆ జాతకుడు లక్ష్మీ పుత్రుడవుతాడు.

జ్యోతిష్యరత్నాలు.....నవరత్నాలు ......!
.......................................................
నవరత్నాలు అనేవి భూసంపద, జలసంపదల నుండి ఉద్భవిస్తాయి. భూమిలో పై పొర సుమారు 60 మైళ్లు ఉంటుంది. ఈ నాటికి భూమిలోనికి తవ్వగలిగిన గరిష్ఠదూరం 5 కి||మీ మాత్రమే. భూమిలోనికి వెళ్లిన కొలది ఉష్ణోగ్రత పెరుగుతూ, ప్రతి 120 అడుగులకు 1 డిగ్రీ చొప్పున పెరుగుతుంది. ఇలా 30 మైళ్ల లోతులో 1200 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ అంతా ద్రవరూపంలో ఉంటుంది. అలా భూమిలోనికి వెళ్లినకొలది అనేక ఖనిజాలూ, రత్నాలూ ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
'స్వాతి ముత్యం' అంటే, స్వాతి కార్తెలో, అంటే సూర్యుడు స్వాతి నక్షత్రంలో సంచరించే కాలంలో, ముడుచుకొని ఉన్న ముత్యపు చిప్పలు తెరచుకుంటాయి. ఆ సమయంలో వర్షం ఆ చిప్పలలో చుక్కలుగా పడిన తర్వాత అవి ముడుచుకొంటాయి. ఇవి లోపల ఘనీభవించి ముత్యాలుగా ఏర్పడతాయి. వీటినే స్వాతి ముత్యాలంటారు.
రత్నధారణజ్యోతిషశాస్త్రాల అవినాభావసంబంధం: రత్నధారణ అనేది పూర్వకాలం నుండి జ్యోతిషశాస్త్రంతో ముడిపడి ఉంది. మానవశరీరంలో సప్తధాతువులు ఉంటాయి. అవి చర్మం, నాడులు, కొవ్వు, మాంసం, అస్థులు (ఎముకలు), ఉపస్థు, స్నాయువులు (సన్నని నరాలు). ఈ సప్తధాతువులకూ, సప్తవర్ణాలకూ, ప్రతి నిధులైన గ్రహాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. చర్మానికి శుక్రుడు, నాడీ మండలానికి బుధుడు, కొవ్వుకు గురుడు, మాంసానికి కుజుడు, ఎముకలకు శని, ఉపస్థుకు శుక్ర-కుజులు, స్నాయువుకు రవి-చం ద్రులు కారకులుగా నిర్ణయింపబడ్డారు. వ్యక్తికి ఏయే ధాతువులు క్షీణదశ వైపు పయనిస్తుంటాయో, వాటికి సమతుల్యత ఏర్పరచి, శారీరక-మానసికశక్తులను అభివృద్ధి పరుస్తాయి. జాతిరత్నాలలో 'దైవికశక్తులు' దాగుంటాయని మన పూర్వికులు నిర్దేశించారు.
రవి (కెంపు) (మాణిక్యం):- సమర్థప్రభువు. ఇది ధరించినవారికి ఆయుర్వృద్ధి, ధనలాభం, అధికారం, ఉన్నతస్థితి, రోగనివారణ, మనోవికాసం కలుగుతాయి. ఇది ఎరుపు రంగుతో బాలసూర్యుని వలె ప్రకాశిస్తుంటుంది. ధాన్యం, గోధుమలు, శుద్ధికి ఆవు పాలు, గంగాజలం, మంత్రం ఓం దృణిః సూర్యాయ నమః||
చంద్రుడు ('ముత్యం') (మౌక్తికం):- గుణం రాణి. ఇది ధరించిన వారికీ, వివాహం కానివారికీ త్వరలో వివాహం జరగటం, కుటుంబ, దాంపత్యానుకూలత, స్త్రీసౌఖ్యం, కార్యసిద్ధి, సంపదలు, ధనధాన్యవృద్ధి, మేహశాంతి కలుగుతాయి. గుండె జబ్బు రాదు. స్త్రీల పాలిట కామధేనువు వంటిది. ముత్యాలు తెల్లగా, స్వయంగా మెరుస్తుంటాయి. ధాన్యంబియ్యం, శుద్ధికి సైంధవ లవణం, వరిపొట్టు (ధాన్యం పొట్టు). మంత్రం ఓం సోం సోమాయ నమః||
కుజుడు(పగడం)-ప్రవాళం:- గుణం సేనానాయకుడు, ఉద్యమనాయకుడు. ఇది ధరించినవారికి శత్రుసంహారం, సాహసం, ధైర్యం చేకూరుతాయి. బుుణవిమోచనం, అధికారం, మాట చలాయింపు కలుగుతాయి. ఇది చిలుక ముక్కు రంగునూ, దొండ పండు రంగునూ పోలి ఉంటుంది. ధాన్యంకందులు. శుద్ధికి ఆవు పాలు, కంకుమ నీరు, రక్తచందనం నీరు. మంత్రం ఓం అం అంగారకాయ నమః||
బుధుడు(పచ్చ) (మరకతం-ఎమరాల్డ్‌):- గుణం తన వ్యాపారాలు తాను చూసుకునే తెలివైనవాడు. ఇది ధరించినవారికి జ్ఞాపకశక్తి, బుద్ధి చాతుర్యం కలిగి, నరాల ఒత్తిడి తగ్గుతుంది. విషదోషాలు హరిస్తుంది. ఉన్మాదం, పిచ్చి, దృష్టిదోషాలను పోగొడుతుంది. ఇది నెమలి పింఛం, గరిక చిగుళ్ల రంగులలో ఉండును. శుద్ధికి ఆవు మజ్జిగ, గోమూత్రం, పసుపు నీరు. ధాన్యంపెసలు. మంత్రం ఓం భుం బుధాయ నమః||
గురువు( 'పుష్యరాగం' )(టోపాజ్‌). గుణం తన మేధాశక్తితో ఇతరులకు మేలు చేసే ఆదర్శవాది. ఇది ధరించినవారికి బుుణవిమోచనం, శత్రుజయం, ఉద్రేకం, ఆందోళన, తగ్గడం, పుత్రసంతానం, వంశవృద్ధి కలుగుతాయి. దీని రంగు బంగారు. లేత గులాబీ రంగులో ఉంటాయి. ధాన్యంసెనగలు శుద్ధికి ఉలువల గంజి, సెనగలు, ఉడికించిన నీరు. మంత్రం ఓం బృహస్పతయ నమః||
శుక్రుడు(వజ్రం) (డైమండ్‌):- గుణం తన మేధాశక్తితో తాను వృద్ధి చెందేవాడు. ఇది ధరించినవారికి నూతనతేజస్సు, కళ, ధన ధాన్యసంపదలు సంసారజీవితంలో అనుకూలత, సుఖం, స్త్రీలకు సుఖప్రసవం కలుగుతాయి. కలరా, ప్లేగు వ్యాధులు రావు. ఇది సహజమైన కాంతితో తేలికగానూ. తీర్చిన కోణాలతోనూ అందంగా కనిపిస్తుంది. ధాన్యంబొబ్బర్లు. శుద్ధికి ఆవు పాలు, బియ్యం కడిగిన నీరు, బొబ్బర్లు ఉడికించిన నీరు, మంత్రం ఓం శుం శుక్రాయనమః||
శని (నీలం) (సఫైర్‌) గుణం ఇతరుల ఆలోచనను ఆచరణలో పెట్టేవాడు. ఇది ధరించినవారికి అపమృత్యు దోషాలు పోవటం, సంఘంలో గౌరవం, పలుకుబడి, ధనలాభం కలుగుతాయి. శని దోషాలు యావత్తూ తొలగును. ఇవి 3 రకాలు 1. ఇంద్రనీలం, 2. మహానీలం, 3. నీలమణి. ఇది నల్లని రంగు, నీలి ఆకాశం రంగు, నెమలి కంఠం రంగులతో ఉంటుంది. ధాన్యంనల్ల నువ్వులు, శుద్ధికి నల్ల నువ్వుల నూనె, నీలిచెట్టు ఆకుల రసం, నల్ల ద్రాక్ష రసం. మంత్రం ఓం శం శనైశ్చరాయనమః||
రాహువు(గోమేదికం) గుణం ఆశాపరుడు, ఇది ధరించినవారికి నష్టద్రవ్యలాభం, స్త్రీమూలంగా సహాయం, లాభం, వశీకరణ కలుగుతాయి, ఆవేదన తగ్గుతుంది. ఈ రాయి సహజమైన గోమూత్రవర్ణం కలిగి ప్రకాశిస్తూ వుంటుంది. ధాన్యంమినుములు, శుద్ధికి మాదీఫలరసం, తేనే, గోమూత్రం. మంత్రం ఓం ఐం హ్రీం రాహవే నమః||
కేతువు(వైడూర్యం) (కాట్స్‌ ఐ) గుణం నిరాశాపరుడు. ఇది ధరించినవారికి శత్రు బాధ నశించి, దుష్టగ్రహపీడలు తొలగుతాయి. ఉత్సాహం, యోచన, లాభం కలుగుతాయి. గర్భిణులు ధరిస్తే సుఖ ప్రసవం అవుతుంది. కష్టాల నుండి రక్షిస్తుంది. ఈ రాయి పై భాగం సన్నని నూలు దారంలా తిరుగుతుంది. వెలుతురులో పిల్లి కన్ను వలె ప్రకాశించును. ఇది లేత పచ్చ కలిసిన బూడిద వర్ణంతో ఉంటుంది. ధాన్యంఉలువలు. శుద్ధికి ఉలువలు ఉడికించిన గరికరస మిశ్రమం. మంత్రం ఓం ఐంహ్రీం కేతవే నమః||
పైన తెలిపిన విధంగా మంచి నాణ్యత కలిగినవాటిని ఉంగరంలో పొదిగించిన తర్వాత, అనుభవజ్ఞులతో శాస్త్రోక్తంగా నవగ్రహజపం చేయించి, పంచగశుద్ధి గల దినాలలో అన్నశాంతి చేసి, వర్జ్య, దుర్ముహూర్తాలు లేకుండా, తారాబలం చూసి, ఆది-గురు-శుక్రవారాలలో, వృషభ- మిథున-కన్య-ధనుర్మీనలగ్నాలలో ఉంగరపు వేలికి ధరించాలి.
నవరత్నపు ఉంగరాన్ని జాతకచక్రం ఉన్నవారు, లేనివారు అందరూ ధరింపవచ్చని శాస్త్రం చెబుతూంది.
నమస్కారం చేసేటపుడు ఉంగరంలోని నీలం పైకి (ఆకాశం) చూస్తున్నట్లుగా ధరించాలి.
ఒకటి, రెండు లేక మూడు విడి రత్నాలు ధరించాలనుకునేవారు, మాత్రం, జాతకచక్రం ఆధారంగా 1. 5. 9 స్థానాధిపతుల రత్నాలు ధరించాలి. స్త్రీలు ముక్కుపుడకలో వజ్రం ధరిస్తే, వారికి నరదృష్టి ఉండదు. వారి భర్తకు ఈమె లక్ష్మీప్రదంగా ఉంటుంది.
ప్రతి ఇల్లాలూ తన మంగళసూత్రంలో, నాణ్యమైన పగడం, ముత్యం ధరించాలి. కుటుంబసౌఖ్యం కలుగుతుంది. వాస్తువిషయంలో ఇంటి నలుదిక్కులలోనూ ఈ నవరత్నాలు నిక్షిప్తం చేస్తే, అందులో నివసించేవారికి అన్ని విధాలుగా రక్షణ ఇస్తుంది.
ఒకరు ధరించిన రత్నాలు ఇంకొకరు ధరించకూడదు.
ఇనుము, ఇత్తడి, కంచు, రాగి, సీసం, వెండి ఇవి దానం ఇవ్వడానికే తప్ప, జాతి రత్నాలు ధరించడానికి కాదు. స్తోమత లేనివారు వెండిలో కొంత బంగారం కలిపించి చేయించుకోవచ్చు. ఏకరత్నం జాతకరత్నం ధరించదలిస్తే, ఆ గ్రహసంబంధిత ఆకారంలో ధరిస్తే సత్ఫలితం. ఉదా|| కుజుడికి పగడం త్రిభుజాకారంలో ఉంగరం చేయించుకోవాలి. సమాజం నుండి లాభాలను కోరుకునేవారు కుడిచేతికి, ఆరోగ్యవిషయానికి ఎడమ చేతికీ, శక్తి కల్గినవారు రెండు చేతులకూ ధరింపవచ్చు. రత్నాలు దోషాలు లేని, ఆకృతి, ఆకారాలు కలిగి, స్వచ్ఛత, సాంద్రత, విమలత కలిగినప్పుడే సత్ఫలితాలు ఇస్తామని శాస్త్రం చెబుతున్నది.

లక్ష్మీ కారక గవ్వలు.......!
గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. లక్ష్మీకారక గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి.శంఖాలకు ఏవిదమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉంది.
గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు.ఇంకా అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం అమలులో ఉంది.దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది .గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్మకం .
క్షీర సాగర మధనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. ఆ విధంగా లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపమయ్యాయి. గవ్వలని లక్ష్మీ దేవి చెల్లెల్లు అని శంఖాలని లక్ష్మీదేవి సోదరులనీ పలువురు భావిస్తారు.గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి ప్రత్యక్ష సంబందం ఉంది.శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉన్నాయి .ఇంకా శివుని జటాజూటం లోను,నందీశ్వరుని మెడలోను గవ్వలే అందం.
గవ్వలు కొందరికి అలంకరణ వస్తువుగాను,కొందరికి ఆటవస్తువుగాను ,కొందరికి తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది.పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు."అని ఉంది.కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక,సాంస్కృతిక,ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం.ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే, మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.అందుకే పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజామందిరంలో పూజించే వారికి సిరిసంపదలను వెల్లివిరుస్తాయి.
ఉపయోగాలు
1)పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కట్టాలి.
2)కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు.
3)గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి.అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే.
4)గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.
5)గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది.
6)వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.
7)వివాహ సమయములలో వదూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది.గవ్వలు శుక్రగ్రహానికి సంబందించినది.కాబట్టి గవ్వలు కామప్రకోపాలు.వీనస్,యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు.
8)వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది.
9)గవ్వల గలలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే.

1 comment:

  1. Titanium Easy flux 125 amp welder | TITanium.Arts
    Tithuan Copper titanium helix earrings Stitch titanium rainbow quartz (Titanium) is a 3.5" x 4.6" hexagonal shaped copper spike. can titanium rings be resized The titanium rings handle is titanium nose hoop weighted with the force of a dime, a bit like a

    ReplyDelete